- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, బేగంపేట: కట్టుకున్న భార్యకు.. భర్తే కాలయముడయ్యాడు. జీవితాంతం కలిసి ఉంటానని మాట ఇచ్చి, చివరికి కాటికి పంపాడు. వివాహమైన ఏడాదికే కట్టుకున్న భార్య గొంతు నులిమి చంపాడో కసాయి భర్త. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. నిజమాబాద్ జిల్లాకు చెందిన మానస (24)కు జగద్గిరిగుట్టకు చెందిన గంగాధర్ (32)తో గత సంవత్సరం నవంబర్ లో వివాహం జరిగింది. పెళ్లైన రెండు నెలలకే వారిమధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో మానస తన పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. అయితే ఈ గొడవల నేపథ్యంలోనే భార్యాభర్తలకు పలుమార్లు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇక ఇలా జరుగుతున్న క్రమంలో ఇటీవలే గంగాధర్ తండ్రి మృతిచెందడంతో మానస అత్తవారింటికి వచ్చింది. మామ గారి అంత్యక్రియల కార్యక్రమం పూర్తిచేసుకొని సోమవారం పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకొంది.
ఇక ఇదే అదునుగా భావించిన భర్త గంగాధర్, భార్యను ఎలాగైనా హతమార్చాలని ప్లాన్ వేశాడు. ఆదివారం రాత్రి భార్యతో గొడవపెట్టుకున్నాడు. వారిమధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కోపోద్రిక్తుడైన గంగాధర్ భార్య గొంతు నులిమి హత్యచేశాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించడానికి మానస గొంతులో విషాన్ని పోసి పరారయ్యాడు. ఇక మానస కిందపడి ఉండడాన్ని గమనించిన బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.