- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, డైనమిక్ బ్యూరో: ట్విట్టర్ సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించడాన్ని హర్షించిన ఇండియన్స్.. ఇక ఆయన గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన విషయాల కోసం గూగుల్లో వెతుకుతున్నారు. దీంతో పరాగ్.. గూగుల్ సర్చింజెన్లో హాట్ టాపిక్గా మారాడు. ఇందులో ముఖ్యంగా ఆయన వయస్సు, ఎక్కడ చదువుకున్నాడు, ఇది వరకు ఏ కంపెనీల్లో పనిచేశారు, ఆయన జీతం ఎంత అన్న వాటిని తెలుసుకునేందుకు సెర్చ్ చేస్తు్న్నట్లు తెలిసింది. అయితే, పరాగ్ 2005లో తన బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువులను కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్ట్లో పూర్తి చేసి 2011లో ట్విట్టర్ కంపెనీలో చేరాడు. పదేళ్ల శ్రమకు తన 38వ ఏట అదే సంస్థకు సీఈవోగా నియమితులయ్యారు. అయితే, ఆయన ఏడాదికి 1 మిలియన్ డాలర్ల వేతనాన్ని పొందుతారని తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీలో రూ.7.50 కోట్లు. అంతేకాకుండా, 12.5 మిలియన్ డాలర్లు విలువ చేసే రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు కూడా పరాగ్కు సంస్థ అందించనుంది.