శ్రీలంకలో భారత యువ క్రికెటర్స్.. బీసీసీఐ వీడియో వైరల్

by  |
BCCI
X

దిశ, వెబ్‌డెస్క్ : శ్రీలంక, భారత్‌ల మధ్య జూలై 13 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే, టీ20 సిరీస్ కోసం కెప్టెన్ శిఖర్ ధవన్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. సిరీస్‌లో భాగంగా శ్రీలంక చేరుకున్న భారత జట్టు.. క్వారంటైన్ పూర్తి చేసుకుంది. అనంతరం కోచ్ ద్రవిడ్ పర్యవేక్షణలో టీమిండియా ఆటగాళ్లు.. రెండు టీమ్స్‌గా విడిపోయి సన్నాహక మ్యాచ్‌లు ఆడారు. అయితే, శ్రీలంకలో వేడి ఎక్కువగా ఉండటంతో టీం ఇండియాలో ఆటగాళ్లు కొంత ఇబ్బందికి గురవుతున్నట్టు జట్టు సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలో హీట్ నుంచి ఉపశమనం పొందేందుకు ఆటగాళ్లు ఏం చేస్తున్నారో తెలుసుకోండి.. అంటూ బీసీసీఐ ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేసింది.


Next Story

Most Viewed