- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- లోక్సభ ఎన్నికలు-2024
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్తో పాటు పలువురు అధికారులకు హై కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ ఆరో డివిజన్ కార్పొరేటర్ కోల మాలతి కులధ్రువీకరణ వివాదంపై ప్రత్యర్థులు హై కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కరీంనగర్ జిల్లా కలెక్టర్, కరీంనగర్ తహసీల్దార్, కార్పొరేటర్ కోల మాలతి, బీసీ వెల్ఫేర్ మంత్రి గంగుల కమలాకర్లకు హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కార్పొరేటర్ కోలమాలతి తప్పుడు బీసీ సర్టిఫికెట్ పొందినట్లు అప్పటి కలెక్టర్ శశాంక ఇచ్చిన ఆదేశాలపై గెజిట్ రాకముందే బీసీ మంత్రిత్వశాఖ స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై అక్టోబర్ 4 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Next Story