బస్సు డ్రైవ్ చేస్తుండగా గుండెపోటు.. చివరకు ఏం జరిగిందంటే..

by  |
బస్సు డ్రైవ్ చేస్తుండగా గుండెపోటు.. చివరకు ఏం జరిగిందంటే..
X

దిశ, ఏపీ బ్యూరో : విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద పెను ప్రమాదం తప్పింది. నలంద స్కూల్ బస్సు డ్రైవర్ సాంబయ్య బస్ డ్రైవ్ చేస్తూ గుండె పోటు గురయ్యాడు. దీంతో బస్సును పక్కన నిలిపివేసి స్టీరింగ్ పై పడి మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు డ్రైవర్ సాంబయ్య గుండెపోటుతో మరణించినట్లు భావిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే బస్సులో స్కూల్ పిల్లలు ఎవరు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలు ఉండి ఉంటే భారీ ప్రమాదమే జరిగేదని అంటున్నారు.


Next Story

Most Viewed