అతనొక రాజకీయ వ్యభిచారి: కేసీఆర్‌పై మాజీ ఎంపీ ఫైర్

by  |
అతనొక రాజకీయ వ్యభిచారి: కేసీఆర్‌పై మాజీ ఎంపీ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్​ నిర్వహించే ప్రెస్​మీట్​కు ముందు ఆయన తాగాడో లేదో పోలీసులు బ్రీత్​ఎనలైజర్​తో చెక్​చేయాలని, తాగలేదని నిర్ధారించుకున్నాకే ఆయన్ను అనుమతించాలని లేదంటే బూతు పురాణమం తప్పదని మాజీ ఎంపీ, బీజేపీ నేత రవీంద్ర నాయక్ ​విమర్శలు చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఒక రాజకీయ వ్యభిచారి అని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్​తానా అంటే కొంత మంది ఐఏఎస్ అధికారులు తందాన అంటున్నారని చురకలంటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు, మరికొంత మంది ఐఏఎస్ ​అధికారులు కేసీఆర్ ​విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అలా కాదని కేసీఆర్‌ను నమ్మితే వారి భవిష్యత్తు నాశనమేనని తెలిపారు.

గిరిజనుల సమస్యలపై పోస్ట్​పెడితే మహిళపై కేసులా?

ఖమ్మం జిల్లాకు చెందిన ఆదివాసీ తెగకు చెందిన ప్రభుత్వ టీచర్ ఝాన్సీ గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై సోషల్ మీడియా లో పోస్ట్ పెడితే పోలీసులు కేసులు పెట్టి ఆమెను వేధిస్తున్నారని రవీంద్ర నాయక్​అన్నారు. పోలీసులు వేధించడంపై రాష్ట్రపతిని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎస్టీ కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను ఆయన కోరారు.


Next Story

Most Viewed