- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ నిర్వహించే ప్రెస్మీట్కు ముందు ఆయన తాగాడో లేదో పోలీసులు బ్రీత్ఎనలైజర్తో చెక్చేయాలని, తాగలేదని నిర్ధారించుకున్నాకే ఆయన్ను అనుమతించాలని లేదంటే బూతు పురాణమం తప్పదని మాజీ ఎంపీ, బీజేపీ నేత రవీంద్ర నాయక్ విమర్శలు చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఒక రాజకీయ వ్యభిచారి అని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్తానా అంటే కొంత మంది ఐఏఎస్ అధికారులు తందాన అంటున్నారని చురకలంటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు, మరికొంత మంది ఐఏఎస్ అధికారులు కేసీఆర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అలా కాదని కేసీఆర్ను నమ్మితే వారి భవిష్యత్తు నాశనమేనని తెలిపారు.
గిరిజనుల సమస్యలపై పోస్ట్పెడితే మహిళపై కేసులా?
ఖమ్మం జిల్లాకు చెందిన ఆదివాసీ తెగకు చెందిన ప్రభుత్వ టీచర్ ఝాన్సీ గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై సోషల్ మీడియా లో పోస్ట్ పెడితే పోలీసులు కేసులు పెట్టి ఆమెను వేధిస్తున్నారని రవీంద్ర నాయక్అన్నారు. పోలీసులు వేధించడంపై రాష్ట్రపతిని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎస్టీ కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను ఆయన కోరారు.