పప్పులో కాలేసిన ఏపీ మంత్రి పేర్ని నాని

by  |
పప్పులో కాలేసిన ఏపీ మంత్రి పేర్ని నాని
X

దిశ, ఏపీ బ్యూరో: సినిమా టిక్కెట్ల ధరల విషయంపై ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ చేశారంటూ ఓ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ ట్వీట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేశారని ఏపీ మంత్రి పేర్ని నాని భావించారు. అంతేకాదు ఆ ట్వీట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తానంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో సినీ నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ స్పందించింది. త్రివిక్రమ్‌కు ఎలాంటి సోషల్‌మీడియా ఖాతాలు లేవని.. ఆయనకు సంబంధించిన స్టేట్‌మెంట్స్‌ అన్నీ తమ నిర్మాణ సంస్థ అధికారిక ఖాతా నుంచే వస్తాయని స్పష్టం చేసింది.

ఈ మేరకు ట్విట్టర్‌లో తెలిపింది. ‘‘దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ చేసే అధికారిక ప్రకటనలు హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌ ట్విటర్‌ ఖాతాల ద్వారానే బయటకు వస్తాయి. ఎందుకంటే, ఆయనకు ఏ సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ ఖాతాల్లేవు. ఆయన పేరు, ఫొటోలతో ఉన్న ఖాతాల నుంచి ఎలాంటి స్టేట్‌మెంట్స్‌ వచ్చినా దయచేసి నమ్మకండి’’ అంటూ ఏపీ సీఎంవో, మంత్రి పేర్ని నాని ఖాతాలను నిర్మాణ సంస్థ ట్యాగ్‌ చేసింది. దీంతో మంత్రి పేర్ని నాని పరిస్థితి పప్పులో కాలేసినట్లైంది. ఆ ట్వీట్ ఎవరు చేశారో అనే దానిపై పూర్తి వివరాలు తెలుసుకోకుండా విమర్శించడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.



Next Story

Most Viewed