- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ రాష్ట్రం తరహాలోనే ఇక్కడ కూడా కొనాలి : ప్రభుత్వ విప్ రేగా

దిశ, మణుగూరు : యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలని ప్రభుత్వవిప్, పినపాక శాసనసభ సభ్యులు రేగా కాంతారావు అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి నిరసనదీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులపట్ల వ్యతిరేకతను మానుకోవాలన్నారు. రైతులపై పెట్టిన అక్రమకేసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయలన్నారు.
పంజాబ్ రాష్ట్ర తరహాలోనే తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యంను కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసనదీక్ష చేపట్టామని ఆయన తెలిపారు. రైతులకు కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తే సహించేదిలేదన్నారు. ఇప్పటికైనా కేంద్రం యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.