- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ సంస్థల్లో పూర్తిగా 100 శాతం వరకు విదేశీ పెట్టుబడులను అనుమతించాలని ప్రతిపాదనపై వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ముసాయిదా కేబినెట్ నోట్ను విడుదల చేసింది. దీన్ని గనక కేబినెట్ ఆమోదిస్తే దేశీయ అతిపెద్ద చమురు రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రైవేటీకరణకు వీలవుతుంది. తాజా ముసాయిదాతో బీపీస్సీఎల్లో ప్రభుత్వానికి ఉన్నటువంటి 52.98 శాతం వాటాను ప్రైవేటుకు వెళ్లిపోనుంది. ఇదివరకే బీపీసీఎల్ను ప్రైవేటీకరణలో భాగంగా అస్సాంలో ఉన్న నుమాలీఘడ్ రిఫైనరీ నుంచి బీపీసీఎల్ వైదొలగిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే బీపీసీఎల్ను సొంతం చేసుకునేందుకు ప్రముఖ ప్రైవేట్ దిగ్గజం వేదాంత ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేసింది. అభిప్రాయాలను సేకరించిన తర్వాత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రివర్గ అనుమతిని కోరనుంది. ప్రస్తుతం పెట్రోలియం రిఫైనింగ్లో 49 శాతం ఎఫ్డీఐలకు మాత్రమే అనుమతి ఉంది.