- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు వేతనాలు పెంచుతూనే ప్రొబెషనరీ కాలాన్ని కూడా పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే అక్టోబర్ నెలతో మూడేండ్ల సర్వీసును పూర్తి చేసుకుని, రెగ్యులర్అవుతామని ఆశించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నిరాశే ఎదురవుతోంది. అయితే వేతనాలను మాత్రం పెంచారు. రాష్ట్రంలో 9,355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను 2018లో నియమించారు.
ముందుగా వీరికి మూడు ఏళ్లు ప్రొబెషనరీ కాలంగా తీసుకుని ఆ తర్వాత రెగ్యులర్ చేస్తామని ప్రకటించారు. ప్రొబెషనరీ సమయంలో వేతనం రూ. 15వేలుగా నిర్ధారించారు. ప్రస్తుతం పని ఒత్తిడి నేపథ్యంలో దాదాపు రెండు వేలకుపైగా ఉద్యోగులు రాజీనామా చేశారు. కాగా, ప్రస్తుతం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనాన్ని రూ. 15 వేల నుంచి రూ. 28,719కి పెంచుతున్నట్లు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ప్రొబెషనరీ కాలాన్ని మాత్రం మూడేండ్ల నుంచి నాలుగేండ్లకు పెంచుతున్నట్లు అదే జీవోలో స్పష్టం చేసింది. దీంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో ఆవేదన నెలకొంది.
తగ్గించాల్సిందే : పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబెషనరీ కాలాన్ని తగ్గించాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి డిమాండ్చేశారు. వారికి వేతనాలు పెంచినందుకు సంతోషమేనని, కానీ ముందుగా నియామకం సందర్భంగా మూడేండ్ల ప్రొబెషనరీ కాలాన్ని ప్రకటించి, ఇప్పుడు ఇంకో ఏడాది పెంచడం సరికాదన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని, త్వరలోనే రాష్ట్రస్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.