డాక్టర్ రాజ్ నారాయణ్‎కు గ్లోబల్ శాంతి అవార్డు..!

by  |
డాక్టర్ రాజ్ నారాయణ్‎కు గ్లోబల్ శాంతి అవార్డు..!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్:

తెలంగాణ సిటిజెన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ్ ముదిరాజ్ గ్లోబల్ శాంతి అవార్డు 2020 అందుకున్నారు. జూబ్లీహిల్స్‎లో సోమవారం అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలోనిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ఆయనకు అవార్డును బహుకరించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల అభివృద్ధి శాఖ జనరల్ మేనేజర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ అక్తర్ అలీ , మహమ్మద్ అబ్దుల్ శాహిం తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. శాంతి, సత్యం, అహింస మార్గంలో జాతిపిత మహాత్మా గాంధీ పయనించారని, నేటి యువత గాంధీజీ చెప్పిన మార్గంలోనే నడవాలని దిశానిర్దేశం చేశారు.


Next Story

Most Viewed