పాతబస్తీలో ఏసీబీ దాడులు.. ఆ అధికారి ఇళ్లే టార్గెట్!

by  |
పాతబస్తీలో ఏసీబీ దాడులు.. ఆ అధికారి ఇళ్లే టార్గెట్!
X

దిశ, క్రైమ్ బ్యూరో: జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్‌లోని ఫలక్‌నామా సర్కిల్ సూపరింటెండెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ముసారాంబాగ్ క్రాంతి కుమార్ తన తల్లి మరణించడంతో జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన రూ.20 వేల దహన సంస్కార ఖర్చులు మంజూరు చేయాలని అధికారులను కోరాడు. దీంతో సూపరింటెండెంట్ పూల్ సింగ్ రూ.5 వేల లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఇచ్చిన సమాచారంతో మంగళవారం మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో లంచం తీసుకుంటుండుగా సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యెండెడ్‌గా పట్టుకున్నారు.


Next Story

Most Viewed