బీజేపీలోకి కీలక నేత.. వైసీపీకి రాజీనామా చేసిన రెండు రోజుల్లోనే..

by  |
బీజేపీలోకి కీలక నేత.. వైసీపీకి రాజీనామా చేసిన రెండు రోజుల్లోనే..
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వైసీపీ అధ్యక్ష పదవితో పాటు వైసీపీకి గత రెండు రోజుల క్రితం గట్టు శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని శ్రీకాంత్ రెడ్డి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తో కలిసి సంజయ్‌తో భేటీ అయ్యారు.

జాతీయ పార్టీలో చేరాలని ఉందని, వచ్చే ఎన్నికల్లో జాతీయ పార్టీ నుంచి పోటీ చేస్తానని రాజీనామా అనంతరం శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. ఇలాంటి తరుణంలో బండి సంజయ్‌ను కలవడంతో బీజేపీలో చేరే అవకాశముందని వార్తలొస్తున్నాయి.


Next Story

Most Viewed