ఆ కమిషనర్ బ్యాంక్‌ లాకర్‌‌లో ఎంతుందంటే!

by  |
ఆ కమిషనర్ బ్యాంక్‌ లాకర్‌‌లో ఎంతుందంటే!
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: గత వారం రోజుల కిందట రూ.లక్షా 65వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డె సురేందర్ అక్రమాస్తుల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగానే బుధవారం ఏసీబీ అధికారులు అతని బ్యాంక్ లాకర్‌ను తెలిచారు. అందులో ఉన్న నగదు, ఆభరణాలు చూసి షాక్ అవ్వడం అధికారుల వంతయ్యింది.

ఆ మొత్తాన్ని ఏసీబీ బృందం స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా విచారణలో భాగంగా మున్సిపల్ కమిషనర్ స్నేహితులను కూడా ప్రశ్నిస్తున్నట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. కాగా, లాకర్‌లో దొరికిన డబ్బు, ఆభరణాల విలువ ఇంకా లెక్కించలేదని త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తామన్నారు.


Next Story

Most Viewed