కోతులతో భయపెట్టిస్తూ దొంగతనాలు.. వీరి రూటే సపరేటు

by  |
కోతులతో భయపెట్టిస్తూ దొంగతనాలు.. వీరి రూటే సపరేటు
X

దిశ, వెబ్‌డెస్క్: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు… దొంగలు కూడా వినూత్నంగా ఆలోచిస్తున్నారు. దొంగతనాలు చేసేందుకు అనేక ఉపాయాలు కనుక్కుంటున్నారు. తాజాగా కోతులతో భయపెట్టిస్తూ దొంగతనాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు ముఠాగా ఏర్పడి ఇలా దొంగతనాలు చేస్తుండగా.. మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కోతులతో ప్రజలను భయపెడుతూ తెలివిగా దొంతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఆటోలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి నుంచి ఈ ముఠా రూ.6 వేలు కాజేసింది. సదరు వ్యక్తి ఆటోలో ప్రయాణిస్తుండగా.. దొంగలు కూడా అదే ఆటోలో ఎక్కారు. ముందు సీట్లో ఒక కోతిని, పక్కన కోతిని, వెనుక మరో కోతిని ఉంచి ప్రయాణికుడిని భయపెట్టించారు.

అనంతరం డబ్బులు కాజేసి కోతులతో సహా పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగతలను పట్టుకున్నారు. గతంలో అనేకమందిని ఇలా కోతులతో భయపెట్టి సొమ్ము కాజేసినట్లు పోలీసులు గుర్తించారు.


Next Story

Most Viewed