- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లాలో పండుగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆట సరదా నలుగురి ప్రాణాలను తీసింది. ఈ షాకింగ్ ఘటన కైకలూరు మండలం వరాహపట్నంలో జరిగింది. వరాహపట్నం గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. దీంతో ఈత రాక నలుగురు చిన్నారులు నీట మునిగారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నలుగురు చిన్నారులు మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. చనిపోయిన వారిలో ముగ్గురు బాలికలు, ఒక బాలుడు ఉన్నారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దసరా పండుగ నాడు గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందడంతో వరాహపట్నంలో విషాదచాయలు అలుముకున్నాయి.