- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని రైతులు, సీపీఐ నాయకులు కొనుగోలు కేంద్రాల్లోని వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం గత పదిహేను, ఇరవై రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లను కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు.
దీంతో రైతులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని ఆవేదన చెందారు. వెంటనే రైతులకు న్యాయం చేసి వడ్లు కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అందే స్వామి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Next Story