పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

by  |
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
X

దిశ, నల్లగొండ: నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ మండలం అప్పాజిపేట గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తంగిళ్ల యాదగిరి రెడ్డి తనకున్న ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ, అదే సమయంలో కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున కొళ్లపారం దగ్గరకు కోడి పిల్లలు వచ్చాయని కంపెనీ సిబ్బంది ఫోన్ చేయటంతో యాదగిరి రెడ్డి (40) అక్కడికి వెళ్ళాడు. పని ముగిసిన అనంతరం అక్కడే పురుగుల మందు తాగాడు. తెల్లవారిన అనంతరం పక్క పొలంలోని రైతులు చూడగా.. యాదగిరి రెడ్డి మృతి చెంది ఉన్నాడు. సమాచారంతో పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. యాదగిరి రెడ్డికి ఇద్దరు ఆడపిల్లలు, ఓ కుమారుడు ఉన్నారు.


Next Story

Most Viewed