- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ 2 పథకం దేశీయంగా ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో సహాయపడిందని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఆథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా చెప్పారు. రానున్న రోజుల్లో ఈ రంగం అభివృద్ధి కోసం ఈ పథకాన్ని మరో మూడు, నాలుగు సంవత్సరాల పాటు పొడిగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఫేమ్ 2 పథకానికి సంబంధించి సబ్సీటీ ఉన్నప్పటికీ ముందస్తు షరతులు, అర్హత ప్రమాణాలు ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనాలను క్షేత్ర స్థాయి మార్కెట్లోని వినియోగదారులు భరించలేనివిగా ఉన్నాయని ఇటీవల ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అంశాలను సమర్థించిన తరుణ్ మెహతా..ఫేమ్ 2 లక్ష్యం కేవలం డిమాండ్ సృష్టించడం కాదు. ఇది వాస్తవానికి సరైన ఉత్పత్తిని సృష్టించడం. ఇది వినియోగదారుల కోసం కొత్త ఉత్పత్తిని నిర్మించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమను పునర్నిర్మించేందుకు సహాయపడుతుంది. అందుకోసం దీన్ని మరో మూడు లేదా నాలుగు సంవత్సరాలు అవసరమని’ వెల్లడించారు.