- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 15వేల మంది మహిళా పోలీసులను నియమించినట్లు సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ మహిళా పోలీసులకు శిక్షణ ఇస్తున్నారని.. డిసెంబరు నాటికి శిక్షణ పూర్తి అవుతుందని సీఎం జగన్ వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో లా అండ్ ఆర్డర్పై చేసిన సమీక్షలో సీఎం జగన్ ఉద్యోగాల భర్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది కనీసంగా 6 నుంచి 7వేల మంది పోలీసుల నియామకాలపై దృష్టిపెట్టాలి. దీనికి సంబంధించి ఆయా శాఖలు సిద్ధం కావాలని సీఎం వైఎస్ జగన్ పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి హోంశాఖ మంత్రి సుచరిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఆర్థిక శాఖ కార్యదర్శి కె సత్యనారాయణ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
- Tags
- Cm Jagan
Next Story