- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: సాధారణంగా ఎవరింటికైనా వెళ్లేముందు పండ్లు, మిఠాయిలు తీసుకుని వెళ్తాం. కానీ నిజామాబాద్లోని ఓ కాలనీలో మాత్రం ఏ ఇంటికి వెళ్లాలన్నా సరే.. కొబ్బరికాయలు, పూలు, నైవేద్యాలు తీసుకుని వెళ్తుంటారు. ఎందుకంటే.. అక్కడి బ్రహ్మపురి కాలనీలో ఉన్న ప్రతీ ఇల్లు ఓ దేవాలయమే! సాధారణంగా ఈ రోజుల్లో ఏ ఇంట్లో చూసినా టీవీల శబ్ధమే వినిపిస్తుంటుంది. కానీ ఇక్కడ ప్రతి ఇంట్లోనూ మంత్రోచ్ఛరణలు, హారతుల పాటలే వినిపిస్తుంటాయి.
నిజామాబాద్ నగరంలోని బ్రహ్మపురి కాలనీకి వందల ఏళ్ల చరిత్ర ఉంది. పూర్వం బ్రాహ్మణులు తమ ఇంట్లోనే దేవాలయాన్ని నిర్మించుకొని, నిత్యం దైవసేవలో ఉండేవారు. ఆ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తుండగా..ఇక్కడున్న దాదాపు 200 ఇళ్లు దేవాలయాలతోనే దర్శనమిస్తున్నాయి. ఇలా వారసత్వంగా వచ్చిన ఆచారాలను నేటికీ కొనసాగిస్తూ, దేవతామూర్తులకు గుడిలో నిత్యం జరిగే అన్ని పూజలను ఇంట్లోనే చేసుకుంటున్నారు. ఇందుకోసం ఇంటికి ఆనుకునే చిన్న చిన్న ఆలయాలను నిర్మించి, వీధుల్లో పెద్ద ఆలయాలు నిర్మించడం విశేషం. ఒకప్పుడు మరాఠాలు ఏలిన ప్రాంతం కావడంతో ఇక్కడ ఛత్రపతి శివాజీ మహరాజ్ ప్రభావం కూడా ఎక్కువే. అందుకే ఇక్కడ ఆంజనేయస్వామి ఆలయాలు వంద వరకు ఉన్నాయి. ఇలా ఇళ్లలో ఆలయాలు నిర్మించడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వచ్చిందని స్థానికులు చెప్తున్నారు.