సీఎల్పీ లీడర్ భట్టితో ఈటల సమావేశం..

by  |
సీఎల్పీ లీడర్ భట్టితో ఈటల సమావేశం..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంగళవారం భేటీ అయ్యారు. ఇటీవలే ల్యాండ్ కబ్జా విషయంలో మంత్రి వర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈటలకు సన్నిహితంగా ఉన్న పొలిటికల్ లీడర్స్, ఆయన ఇలాకాలోని ప్రభుత్వ అధికారులపై టీఆర్ఎస్ అధిష్టానం నజర్ పెట్టింది.

ఆయనతో రాపో మెయింటెన్ చేస్తున్న అధికారులపై వేటు వేస్తూ పక్కకు జరుపుతున్నారు. నెమ్మదిగా ఈటల రాజేందర్‌ను ఒంటరిని చేసేందుకు గులాబీ బాస్ కంకణం కట్టుకున్నారని అటు ప్రతి పక్షాలు, ఈటల మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క సమావేశపై ప్రస్తుత రాజకీయాలపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా, వీరిద్దరి రహస్య సమావేశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.


Next Story

Most Viewed