ఇద్దరు DMHOలపై పరువు నష్టం దావా..

by Sridhar Babu |   ( Updated:2020-07-03 13:02:16.0  )

దిశ, కొత్తగూడెం: తనకు కరోనా పాజిటివ్ రాకున్నా వచ్చినట్టు ప్రకటించిన ఖమ్మం డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతీ, భద్రాద్రికొత్తగూడెం డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్ పై అదే జిల్లాకు చెందిన సివిల్ సర్జన్ డాక్టర్ శంకర్ నాయక్ శుక్రవారం పరువు నష్టం దావా వేశాడు. తనను మానసిక క్షోభకు గురి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం డీఎంహెచ్‌వోలు ఒక్కొక్కరి పై రూ.2కోట్లకు పరువునష్టం దావా వేసినట్లు వెల్లడించారు. కాగా, గతంలో కొవిడ్ టెస్టు రిపోర్టుల వెల్లడిలో నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఆరోపించడమే కాకుండా, డీఎంహెచ్‌వో మాలతీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు శంకర్ నాయక్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed