- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కాంగ్రెస్లో భగ్గుమన్న విబేధాలు.. మాజీ ఎమ్మెల్సీ ముందే వాగ్వాదం

దిశ, మణుగూరు: పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అనేది చాలా ప్రధానమైన అంశమని, పార్టీ నిలబడాలంటే తప్పనిసరిగా సభ్యత్వం ఉంటేనే పార్టీకి గుర్తింపు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మాజీ M.L.C పోట్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పద్మశాలి భవనంలో నియోజకవర్గ కన్వీనర్ చందా సంతోష్ నేతృత్వంలో పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ M.L.C పోట్ల నాగేశ్వరరావు, టీపీసీసీ ఉపాధ్యక్షులు,భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య,మాజీ ఎంపీ పోరిక బలరాం నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని,ప్రతీ యొక్క కార్యకర్త సైనికుడిలా పార్టీకి పని చేయాలని వ్యాఖ్యానించారు. డిజిటల్ పద్దతి ద్వారా పార్టీ సభ్యత్వం జరుగుతుందని వివరించారు. ముందుగా మండలాల అధ్యక్షులు డిజిటల్ ద్వారా లింకులు తీసుకోవాలన్నారు. ఇలా చేయడం ద్వారా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందని తెలిపారు.
గ్రూపులుగా ఏర్పడ్డ పలు నాయకులు
పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సులో కొందరు వ్యక్తులు గ్రూపులుగా ఏర్పడటం వల్ల అవగాహన సదస్సు కొంత గందరగోళంగా మారింది. ప్రోటోకాల్ ప్రకారం ఎందుకు పిలవలేదని, ప్లెక్సీలో ఫోటోలు ఎందుకు వేయలేదని నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు పోతురెడ్డి శ్రీనివాస్ రెడ్డి సదస్సులో నిలదీశారు. గ్రూపులుగా ఏర్పడితే పార్టీ ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు. ఇదే క్రమంలో పినపాక నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు పోతురెడ్డి శ్రీనివాస్ రెడ్డి సభ్యత్వ అవగాహన సదస్సు నుంచి బాయ్ కాట్ చేసి బయటకు వెళ్లిపోయారు. ఈలోగా యూత్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి జిందాబాద్ అంటూ కేకలు పెట్టారు.
అనంతరం కొంతమంది పార్టీ నాయకులు సర్దిచెప్పి మరల లోపలికి తీసుకువచ్చారు. ఈ లోగా మణుగూరు మండల అధ్యక్షుడు గురిజాల గోపి మాట్లాడుతూ…ఒక మండలంలో మండల అధ్యక్షుడు పర్మిషన్ లేకుండా కార్యక్రమాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఒక వేళ కార్యక్రమం చేస్తే మండల అధ్యక్షుడికి చెప్పాల్సిన బాధ్యత లేదా అని మండిపడ్డారు. ఇలా చేయడం ద్వారా పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని మాట్లాడుతుంటే గురిజాల గోపిపై తన కార్యకర్తలు సదస్సులో ఈలలు, కేకలతో అరుపులు పెట్టారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ M.L.C పోట్ల నాగేశ్వరరావు ముందే పలువురు నాయకులు వాగ్వాదం పెట్టుకోవడం గమనార్హం. విబేధాల వల్ల పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సులో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తల పట్టుకున్నారు.దీనికి తోడు అశ్వాపురం మండల అధ్యక్షుడు గాదె కేశవరెడ్డి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యను పార్టీ విధి విధానాలు ఇంతేనా..మీరు గ్రూపులను ప్రోత్సహిస్తున్నారా అని ప్రశ్నించారు. దీంతో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో పాటు నాయకులందరూ పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు నుండి బయటకు వెళ్లిపోయారు.ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని టీపీసీసీ,ఏఐసీసీకి అనుగుణంగా నడుచుకొని పార్టీని ముందుకు నడిపించాలని మండల ప్రజలు,కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు కోరుతున్నారు.
- Tags
- congress