- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: తెలంగాణ రాష్ట్రంలోనే భారీ డబ్బు నోట్లతో వాసవి మాతను ధన లక్ష్మిదేవిగా అలంకరించిన ఘనతను మహబూబ్నగర్ బ్రాహ్మణవాడి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ సభ్యులు సాధించారు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు అమ్మవారిని పలు రూపాలలో అలంకరిస్తూ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారిని 4కోట్ల, 44 లక్షల, 44 వేల, 444రూపాయల, 44 పైసలతో ధనలక్ష్మి రూపాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వీధులలో వందలాది మంది భక్తులతో పల్లకీ సేవ చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ సభ్యులు మంత్రిని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.