- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఈ నెల 15న ఏర్పడనున్న శని, కుజల కలయిక.. ఆ రాశుల వారికి రాజయోగం.. మీ రాశి ఉందా?
దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం,నవ గ్రహాల్లో ఉగ్ర స్వభావం కలవాడు. ఈ గ్రహాన్ని మార్స్ అని కూడా అంటారు. జాతకంలో, కుజుడు పదవ ఇంట్లో బలమైన స్థానాన్ని కలిగి ఉంటాడు. నవగ్రహాలకు అధిపతిగా వ్యవహరిస్తాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 15న కుజుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించనున్నారు. శని ఇప్పటికే కుంభరాశిలో ఉన్నందున, మార్చి 15 న శని, కుజుడు మధ్య కలయిక ఏర్పడనుంది. గ్రహాల యొక్క ఈ అరుదైన కలయిక కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా 3 రాశులకు చెందిన వారికీ రాజయోగం పట్టనుందని జ్యోతిష్యులు చెప్పారు. ఆ రాశు లేంటో ఇక్కడ చూద్దాం..
మేష రాశి
ఈ రాశికి చెందిన వ్యక్తులు శని సంచార కలయిక కారణంగా ఊహించని ప్రయోజనాలను పొందుతారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ప్రాజెక్ట్ ఓ కొలిక్కి వస్తోంది. ఉద్యోగులకు ఈ సమయం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు సమసిపోయి సంతోషంగా జీవిస్తారు. మీ భార్య మద్దతుతో మీ పనిని ముందుకు తీసుకెళ్లండి. మీరు మంచి ఆర్థిక ఫలితాలను సాధిస్తారు.
సింహ రాశి
ఈ రాశి వారికి అంగారకుడి సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. కెరీర్ పరంగా ఇది ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వస్తుంది. వ్యాపారాల్లో మీరు ఊహించని విధంగా డబ్బు వస్తుంది. అంతేకాదు డబ్బుల విషయంలో పలు రకాలుగా సంపాదించే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి బయటపడతారు.