దీపావళి వేళ ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

by Disha Web Desk 6 |
దీపావళి వేళ ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది దీపావళి నవంబర్ 12న పండగ వస్తోంది. అయితే దీపావళి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ పండుగ కొన్ని రాశుల వారికి కలిసివస్తుందట. రాహు, కేతు, శని కదలికల కారణంగా మంచి జరుగుతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

మేష రాశి: దీపావళి తర్వాత ఈ రాశివారు శుభవార్తలు వింటారు. అలాగే పనిలో విజయం సాధించడంతో పాటుగా ధనలాభం పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. శివుని అనుగ్రహం వీరిపై ఉండటం వల్ల జీవితం ఆనందంగా ఉంటుంది.

మిథున రాశి: ఈ రాశి వారికి అందరిలో మంచి గౌరవం లభిస్తుంది. వ్యాపార, ఉద్యోగ పరంగా, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభించి మంచి స్థాయికి ఎదుగుతారు.

సింహ రాశి: వారు ఉద్యోగం మారడం గురించి ఆలోచిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ధనలాభం పొందుతారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.

కన్యా రాశి: ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఏ పని చేసినా ప్రయోజనం ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఏది చేసినా అదృష్టం కలిసి వస్తుంది.

ధనుస్సు రాశి: పని చేసే చోట శుభ వార్తలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అన్నింటా శుభ ఫలితాలు పొందుతారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.



Next Story

Most Viewed