హత్యాచారం చేసిన దుండగుడిని వెంటనే ఉరితీయాలి- ఎఐటీఫ్

by  |
హత్యాచారం చేసిన దుండగుడిని వెంటనే ఉరితీయాలి- ఎఐటీఫ్
X

దిశ, ఆత్మకూర్: ఆరేళ్ల బాలికను అత్యాచారం చేసి, హత్యచేసిన దుండగుడిని వెంటనే ఉరితీయాలని అఖిల భారత గిరిజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలోతు లింగునాయక్ డిమాండ్ చేశారు. మండల్ లో అఖిల భారత గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కన్నడ హీరో ఇంద్ర కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగునాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఆడపిల్లలపై మానభంగాలు, అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయని, హైదరాబాద్ సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల గిరిజన బాలికను హత్యాచారం చేసి చంపేశారని తెలిపారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా దళిత, గిరిజన మహిళలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరైన న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.

మహిళలపై అత్యాచారాలు, దాడులు, అరాచకాలు, మానభంగలు లేకుండా ఉన్నప్పుడే దళిత, గిరిజనులకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నిరోజులు గిరిజనులపైన మారణ కాండ ఈ రాష్ట్రంలో.. హత్యాచార నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకొని కోటి రూపాయలు ఎక్సగ్రెసియా లేదా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

ర్యాలీలో పాల్గొన్న కన్నడ హీరో ఇంద్ర మాట్లాడుతూ.. హత్యాచారం చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని, మన దేశంలో అడుగడుగునా ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. వీటిని ఆపడానికి ఎన్ని చట్టాలు వచ్చిన ఆపలేకపోతున్నారని, మనలో తిరుగుతున్న మానవ మృగాలను తరిమికొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐటీఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ నాయక్, మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్, మండల్ సెక్రటరీ వెంకన్న నాయక్, సింగ్గం ప్రశాంత్, పులిశెట్టి భాను, గిరిజన నాయకులు జీవన్, భూక్య బాలాజీ నాయక్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed