డిగ్రీ విద్యార్థులకు తరగతుల ప్రారంభం అప్పుడే!

by  |
డిగ్రీ విద్యార్థులకు తరగతుల ప్రారంభం అప్పుడే!
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా ఇన్ని రోజులు విద్యార్థులకు భౌతిక తరగతులు నిర్వహించలేదు. ఆన్‌లైన్ క్లాసులతోనే సరిపెట్టారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఫిజికల్ తరగతులు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి రంగం సిద్ధం చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి డిగ్రీ ఫస్టియర్ వారికి భౌతిక తరగతులు ప్రారంభించనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు.

దోస్త్ మూడు విడతల్లో ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు మంగళవారం(ఈరోజు) నుంచి అక్టోబర్ 4 వరకు తమకు సీటు వచ్చిన కాలేజీల్లో భౌతికంగా రిపోర్టు చేయాలన్నారు. ఒక కాలేజీలో సీట్లు పొందిన విద్యార్థులు బ్రాంచీలు, కోర్సులను మార్చుకునేందుకు అక్టోబర్ 5 నుంచి 7 తేదీల్లో ఇంట్రా కాలేజీ వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు.


Next Story