విద్యార్థి సంఘాలు- వీసీ మధ్య ఢీ అంటే ఢీ.. రూ.5 కోట్లు పరువునష్టం దావా

by  |
విద్యార్థి సంఘాలు- వీసీ మధ్య ఢీ అంటే ఢీ.. రూ.5 కోట్లు పరువునష్టం దావా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు- వీసీ మధ్య ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ నెల 18 న విద్యార్థి సంఘ నాయకులపై వీసీ విలేకరుల సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. విద్యార్ధి సంఘాల నేతల ముసుగులో ఉద్యోగాల కోసం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ, రిజిస్ట్రర్ పదవిని తాము చెప్పిన వ్యక్తులకు ఇవ్వలేదని యూనివర్సిటీ పరువు తీస్తున్నారని ఆరోపణలు చేసారు. బుధవారం విద్యార్థి సంఘాల నేతలు వీసీ రవీందర్ గుప్తా పై పరువునష్టం దావా వేశారు. రూ.5 కోట్ల కి పరువునష్టం దావా వేసిన ఏడుగురు విద్యార్థి నాయకులు. ఈ మేరకు విద్యార్ధి నేతలు నిజామాబాద్ కోర్టు ఎదుట ప్రతులను ప్రదర్శించారు.


Next Story

Most Viewed