యూపీ ఎన్నికల తర్వాతే సీఎంపై డెసిషన్: స్టేట్ మినిస్టర్

by  |
యూపీ ఎన్నికల తర్వాతే సీఎంపై డెసిషన్: స్టేట్ మినిస్టర్
X

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే ముఖ్యమంత్రి ఎవరనేదానిపై నిర్ణయముంటుందని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తెలిపారు. కేంద్ర నాయకత్వమే ఈ నిర్ణయం తీసుకుంటుందని లక్నోలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో విలేకరులకు వివరించారు. వచ్చే ఏడాది తొలినాళ్లలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎవరి నాయకత్వంలో బరిలోకి దిగుతుందని, సీఎం క్యాండిడేట్ ఎవరనే ప్రశ్నలు పార్టీవర్గాల్లో కొంతకాలంగా చెలరేగుతూనే ఉన్నాయి.

ఈ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలోనే బీజేపీ పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ గతవారం వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని అధిష్టానం తీసుకుంటుందని అంతకు ముందు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు.


Next Story

Most Viewed