అవినీతిపై విచారణకు సిద్ధమా: దాసోజు శ్రవణ్

by  |
sravan
X

దిశ,తెలంగాణ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అనుచిత వాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి చేసిన అవినీతిపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సవాల్ విసిరారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో గురువారం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మల్లారెడ్డి కోడలు పేరున ఉన్న ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీ భూములలో జరిగిన అవినీతిపై రేవంత్ రెడ్డి ఆరోపించారన్నారు. వాటిని రుజువు చేయమని మల్లారెడ్డి ప్రశ్నించారని, దీనిని నిరూపించే విధంగా విచారణ చేయించాలని సీఎం కేసీఆర్ ని ఆయనే అడగాలని శ్రవణ్ కోరారు. అవినీతి జరిగినట్లు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటామని దాసోజు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ఆయనతో పోటీ చేయాలని మల్లారెడ్డికి ఉంటే ముందు వారి అవినీతి పై విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోవాలని ఆయన సూచించారు. తిట్ల పురాణం మొదలెట్టి, తిట్ల రాజకీయాలను చేయాలని చూస్తే మీకంటే మాకు ఎక్కువ తిట్లు వచ్చని దాసోజు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed