- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: సిమెంట్ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 13 శాతం వృద్ధిని సాధిస్తుందని, దేశీయంగా మౌలిక సదుపాయాలు, పట్టణ గృహాల డిమాండ్ పునరుజ్జీవనం వల్ల ఈ వృద్ధి నమోదవుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. అయితే, పెరిగే అమ్మకాల పరిమాణం.. తిరిగి విద్యుత్, ఇంధన వ్యయాలపై పడుతుందని క్రిసిల్ వివరించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వ్యయం సిమెంట్ లాభదాయకతపై ఆధారపడి ఉంటుందని క్రిసిల్ అభిప్రాయపడింది. ముడి పదార్థాలైన డీజిల్, బొగ్గు, పాలిప్రొఫైలిన్ బ్యాగుల ధరలు టన్నుకు రూ. 150-రూ. 200 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఇది మొత్తం సిమెంట్ అమ్మకాల వ్యయంలో సుమారు 55 శాతం ఉంటుందని క్రిసిల్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో పరిశ్రమ 31 శాతం ప్రతికూలత నుంచి వేగంగా కోలుకుందని, ఈ మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఇది 1-2 శాతం ప్రతికూలతకు పరిమితం అవ్వొచ్చని క్రిసిల్ తెలిపింది. ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సమవాత్సానికి బడ్జెట్లో ప్రకటించిన విధంగా కీలకమైన గృహ నిర్మాణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సకాలంలో నిధులను అందించడం ద్వారా డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నట్టు క్రిసిల్ వెల్లడించింది.