అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన బైక్...ఒకరి మృతి

by Disha Web Desk 15 |
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన బైక్...ఒకరి మృతి
X

దిశ,చౌటుప్పల్ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన సంఘటనలో ఒకరి మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని మల్కాపురం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘట్కేసర్ మండలం పోచారం గ్రామానికి చెందిన చందన్ కుమార్(24) తన పల్సర్ ద్విచక్ర వాహనంపై హుజూర్​నగర్ కు చెందిన రాజేష్ అనే వ్యక్తితో విజయవాడ వైపు నుండి హైదరాబాద్ కు

వెళ్తుండగా మల్కాపురం గ్రామం దాటుతున్న సమయంలో అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న చందన్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో హయత్ నగర్ లోని మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.

Next Story