- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
AP:ఇంగ్లాండ్లో ఆంధ్రా యువకుడు మృతి
X
దిశ,నరసరావుపేట: ఏపీలో యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లిన ఆంధ్రా యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆ యువకుడు పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరుకు చెందిన సాయిరాం (24)గా గుర్తించారు. సాయిరామ్ ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లాడు. అయితే ఈ నెల 2వ తేదీన మాంచెస్టర్ బీచ్ వద్ద ఇంగ్లాండ్ పోలీసులు సాయిరాం మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే మాంచెస్టర్ పోలీసులు పల్నాడు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Advertisement
Next Story