బైక్ పై నుంచి పడి మహిళ మృతి..

by Kalyani |
బైక్ పై నుంచి పడి మహిళ మృతి..
X

దిశ, లోకేశ్వరం: భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళ కళ్ళు తిరిగి కింద పడి మృతి చెందిన సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. కుంటాల మండలం కల్లూరు గ్రామానికి చెందిన పసుల సాయన్న భార్య పసుల గోదావరి (40) తో కలిసి ఈనెల 6న లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామానికి బంధువుల పెళ్లికి వెళ్లారు. తిరిగి స్వగ్రామం కల్లూరు వెళ్తుండగా హవర్గా సమీపంలో కళ్ళు తిరిగి కింద పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం బైంసా కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మరణించారని, మృతురాలి తమ్ముడు దాస శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.



Next Story

Most Viewed