బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటా : ఎమ్మెల్యే

by Kalyani |
బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటా :  ఎమ్మెల్యే
X

దిశ, కొమురవెల్లి : కొమురవెల్లి మండలం తపాస్ పల్లి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్కనీ శ్రీకాంత్ శనివారం అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, అంత్యక్రియలలో పాల్గొన్నారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన బాలుడి పరిస్థితిని చూసి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల, కొమురవెల్లి మండలాల బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story