కరెంట్ షాక్ తో ఇద్దరికి గాయాలు

by Disha Web Desk 1 |
కరెంట్ షాక్ తో ఇద్దరికి గాయాలు
X

దిశ, శంకరపట్నం : కరెంట్ షాక్ తగిలి ఇద్దరికి గాయాలైన ఘటన శంకరపట్నం మండలం అంబాలాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కామెరా నారాయణ అనే వ్యక్తి తన ఇంటి వద్ద రేకుల షెడ్డు నిర్మాణం చేపడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రేకుల షెడ్డు వేస్తున్న గంగాధర మండలం వడ్డారంకు చెందిన రామగిరి శ్రీనివాస్, శంకరపట్నం మండలం మక్త గ్రామానికి చెందిన నేరెళ్ల సాయికుమార్ అనే ఇద్దరు వ్యక్తులకు ఇంటిపై ఉన్న 11 కే.వీ విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో వారు తీవ్ర గాయాలకు గురయ్యారు. వెంటనే ఇద్దరిని 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.


Next Story

Most Viewed