మహిళలను టార్గెట్ చేసిన ఇద్దరు స్నేహితులు.. ఆ తర్వాత..

by Disha Web Desk |
మహిళలను టార్గెట్ చేసిన ఇద్దరు స్నేహితులు.. ఆ తర్వాత..
X

దిశ,మల్యాల: జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో మల్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో గొలుసు దొంగతనానికి పాల్పడిన ఇద్దరు చైన్ స్నాచర్లు అరెస్ట్ చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రత్నాపురం ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మల్యాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండలం తోర్లికొండకు చెందిన నూనె శ్రీకాంత్, గొట్టిముక్కల విజయ్ ఇద్దరు స్నేహితులు. కాగా వీరు ఆన్లైన్ గేమ్‌లో డబ్బులు పెట్టుబడి పెట్టి నష్టపోవడం, జల్సాలకు బానిసలుగా మారారు. దీంతో దొంగతనాల ద్వారా పోయిన డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మహిళలను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. దీంతో వారిని అరెస్ట్ చేసి నిందితుల నుండి మూడున్నర తులాల బంగారు చైన్, పుస్తెలతాడు, ద్విచక్ర వాహనం ,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రకాష్ వెల్లడించారు. ఈ సమావేశంలో సీఐ రమణమూర్తి, ఎస్సై చిరంజీవి, సిబ్బంది ఉన్నారు



Next Story