- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విషాదం నింపిన అతివేగం.. ఇద్దరు యువకులు మృతి

దిశ,డోర్నకల్(మరిపెడ): మితిమీరిన వేగంతో బైకు వెనుక నుంచి మరో బైకును ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జాతీయ రహదారి 365 పై జరిగింది. ఎస్ఐలు బి.అంజయ్య,బి.సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలంలోని బాబోజిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని భోజ్య తండాకు చెందిన గుగులోతు కార్తీక్(22), వెంకురాం తండాకు చెందిన భూక్య సంతోష్(19) ఇద్దరు మిత్రులు. వీరితో పాటుగా అదే జీపీలోని వాగు ఒడ్డు తండాకు చెందిన అజ్మీర సుధీర్ మరిపెడ మండల కేంద్రానికి వారి వారి బైకులపై వస్తున్నారు.
కార్తీక్, సంతోష్ ఒకే బైకుపై ఉండగా సుధీర్ వెనుక మరో బైకుపై వస్తున్నాడు. ఈ క్రమంలో మరిపెడ మండల కేంద్రంలోని బంగ్లా మరిపెడ క్రాస్ రోడ్ వద్ద సుధీర్ బైకు వెనుక నుంచి కార్తీక్ బైకును వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కార్తీక్, సంతోష్ లకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, సుధీర్ తలకు బలమైన గాయాలవడంతో తొలుత మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం కు తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అంజమ్మ, సతీష్ తెలిపారు. ఇద్దరు యువకుల మృతితో ఆయా తండాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.