ప్రాణం తీసిన దళితబంధు ట్రాక్టర్​..

by Disha Web Desk 19 |
ప్రాణం తీసిన దళితబంధు ట్రాక్టర్​..
X

దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ వ్యవసాయ బావిలో పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ యజమాని మృతి చెందాడు. పొలం దున్నుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, మృతుడిని మానకొండూరు మండల కేంద్రంలోని బంజేరుపల్లెకు చెందిన శంకర్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు బావి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. అయితే, శంకర్ ఇటీవలే దళిత బంధు స్కీమ్ కింద ట్రాక్టర్ తీసుకున్నాడు. ఇంతలోనే ఈ దారుణం జరగడంతో శంకర్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.


Next Story

Most Viewed