సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన ఆ ముగ్గురు..

by Disha Web Desk 4 |
సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన ఆ ముగ్గురు..
X

దిశ, వెబ్‌డెస్క్ : సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం అములుకుంది.బంధువులతో కలిసి సముద్రంలో దిగిన ముగ్గురిని అలలు మింగేశాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్.జి.ఆర్ పురం బీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖ జిల్లాకు చెందిన తిరుపతి గణేష్ తన మేనకోడళ్లు, బంధువులతో కలిసి శనివారం ఎన్.జి.ఆర్ పురం బీచ్‌లో స్నానానికి వెళ్లారు. సముద్రం ఒడ్డున స్నానం చేస్తుండగా అలలు పెద్దగా వచ్చి తిరుపతి గణేష్, దీవెన, మానసలను లోపలికి లాక్కెళ్లాయి. వెంటనే మిగతా వారు అప్రమత్తమై అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రెస్యూ టీం రంగంలోకి దిగి ముగ్గురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. నిన్నటి నుంచి వెతకగా.. ఆదివారం సముద్రంలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులను మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.



Next Story

Most Viewed