- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
తండ్రిని హత్య చేసిన తనయుడు..
by Kalyani |

X
దిశ, లోకేశ్వరం: బాగోగులు చూసుకోవాలని అడిగిన తండ్రిని కొడుకు రోకలిబండతో కొట్టి చంపిన సంఘటన లోకేశ్వరం మండలం లో జరిగింది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామానికి చెందిన గన్నారం భూమన్న (80)ను అతని పెద్ద కుమారుడు గన్నారం భూమన్న శనివారం ఉదయం ఇంట్లో రోకలిబండతో కొట్టి చంపాడు. నిందితునికి భార్య గత సంవత్సరం క్రితం ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తండ్రీ కొడుకులు కలిసి ఉంటున్నారు. కాగా గత నాలుగైదు రోజుల నుంచి కొడుకు భూమన్న తండ్రి బాగోగులు సక్రమంగా చూడకపోవడంతో కొడుకు పై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేయగా ఆవేశంతో కొడుకు తండ్రి పై రోకలిబండతో దాడి చేయగా సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వెంటనే నిందితుడు అతని చెల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలుపగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story