- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గంజాయి ముఠా గుట్టురట్టు.. ఐదుగురు వ్యక్తులు అరెస్ట్
by Disha Web Desk 19 |
X
దిశ, మెదక్ ప్రతినిధి: గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద ఎండు గంజాయితో పాటు నగదు, మొబైల్ ఫోన్లను సీజ్ చేసి ఐదుగురిని డిమాండ్ చేసిన ఘటన మంగళవారం మెదక్ మండలం పేరూరులో చోటుచేసుకుంది. రూరల్ సీఐ విజయ్, ఎస్ఐ మోహన్ రెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం పేరూరు వద్ద వాహనా తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్పై వచ్చిన ముగ్గురు వద్ద ఎండు గంజాయి లభ్యమైనది. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ వ్యవహారంలో మరో ఇద్దరు ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వీరిలో బానోతు గణపతి, నిఖిల్, నరేందర్ గౌడ్, సుధీర్, నవీన్లు ఉన్నారు. వారి 240 గ్రాముల ఎండు గంజాయి, 5200 నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఐదుగురిపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Next Story