ప్రాణం తీసిన ఈత సరదా.. మహబూబ్ నగర్ నుండి వచ్చి హుజూర్‌నగర్‌లో మృతి

by Aamani |
ప్రాణం తీసిన ఈత సరదా.. మహబూబ్ నగర్ నుండి వచ్చి హుజూర్‌నగర్‌లో మృతి
X

దిశ,హుజూర్ నగర్ : బావిలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన హుజూర్ నగర్ పట్టణంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు గొర్రెల కాపరులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 8 మంది గొర్రెలు కాపరులు గొర్ల మేత మేపేందుకు హుజూర్ నగర్ ప్రాంతం వచ్చారని తెలిపారు. అందులో నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిమండ్ల గ్రామానికి చెందిన కనుమనూరు శేఖర్ (14) తోపాటు మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం చందాపురం గ్రామానికి చెందిన మోదీపురం లక్ష్మణ్ (21) శుక్రవారం ఉదయం హుజూర్ నగర్ పట్టణంలోని దద్దనాల చెరువు సమీపంలోని ఒక బాయిలో ఈత కొట్టేందుకు బావిలోనికి దిగి ఆ నీటిలో మునిగి పోయారని తెలిపారు.

అయితే శేఖర్ కు ఈత వస్తుందని లక్ష్మణ్ కు ఈత రాదని సమాచారం. వీరు నీటిలో మునిగే సమయంలో శేఖర్ తమ్ముడు అక్కడే ఉండడంతో వెంటనే మిగతా గొర్రెల కాపరులకు సమాచారం అందించాడని వారు పోలీసులకు రిస్కీ టీంకు తెలియజేయడంతో వెంటనే ఆ సంఘటన స్థలానికి వారు చేరుకునే సహాయ చర్యలు చేపట్టారు. నీటిలో మునిగిన ఇద్దరు యువకులు అప్పటికే మృతి చెందడంతో వారి మృతదేహాలను బయటకు తీశారు. అయితే శేఖర్ ఐదో తరగతి చదువుతున్నాడని ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో జీవనాధారం కోసం గొర్రెలు కాసేందుకు వచ్చాడని చెప్పారు. సంఘటన స్థలానికి పోలీసులు రెవెన్యూ అధికారులు చేరుకొని మృతి చెందిన యువకుల వివరాలను సేకరిస్తున్నారు.



Next Story

Most Viewed