ఇద్దరు మైనింగ్ అధికారులు సస్పెన్షన్​

by Sridhar Babu |
ఇద్దరు మైనింగ్  అధికారులు సస్పెన్షన్​
X

దిశ, కొత్తపల్లి : మైన్స్ అండ్ జియోలాజీ విభాగంలో ప్రక్షాళన మొదలైనట్టుగా ఉంది. ఉన్నతాధికారులు ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు, కరీంనగర్ అసిస్టెంట్ డైరెక్టర్ రామాచారిని సస్పెండ్ చేస్తూ మైన్స్ అండ్ జియోలాజీ ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. కరీంనగర్ గ్రానైట్ క్వారీలకు సంబంధించిన వ్యవహారంలో జరిగిన అవకతవకల విషయంలోనే వీరిద్దరిని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. 2013 సంవత్సరంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో వీరిని సస్పెండ్ చేశారని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed