- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎస్సై ప్రేమాయణం.. కానిస్టేబుల్కు చుక్కలు
దిశ, వెబ్డెస్క్: సమాజం తప్పుడు దారిలో వెళితే.. వాటిని సరిచేసే బాధ్యత పోలీసులదే. అలాంటిది కొంత మంది పోలీసులే దారి తప్పి వ్యవహరిస్తున్నారు. ఇటీవలే జరిగిన ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ఎస్సై తన వద్ద పని చేసే కానిస్టేబుల్ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. పెళ్లైన 6 నేలలు బాగానే ఉన్న ఎస్సై.. ఆ తర్వాత నుంచి అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. కానిస్టేబులైన భార్యను చంపే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
నెల్లూరు జిల్లా వేదాయపాళెంలో షేక్ మహబూబ్ షుఖాని అనే వ్యక్తి ఎస్సైగా పనిచేస్తున్నాడు. ఈయన గతంలో సంతపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించేవాడు. ఆ సమయంలోనే ఓ మహిళ కానిస్టేబుల్తో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లుకు ఎస్సై ప్రేమను అంగీకరించిన కానిస్టేబుల్ను పెళ్లి చేసుకున్నాడు మహబూబ్. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. పెళ్లైన 6 నెలల తర్వాత నుంచి ఎస్సై.. భార్య (కానిస్టేబుల్) కు చుక్కలు చూపించడం మొదలు పెట్టాడు. అదనపు కట్నం తేవాలని వేధించేవాడు. ఒకానొక సమయంలో చంపడానికి కూడా ప్రయత్నించాడు. ఎవరు లేని ప్రదేశంలో ఇల్లు అద్దెకు తీసుకుని భార్యను అక్కడ ఉంచాడు. ఈ క్రమంలోనే ఆమెను గొంతు నొక్కి చంపే ప్రయత్నం చేశాడు. కానిస్టేబుల్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను అక్కడే వదిలి తలుపులు వేసుకుని వెళిపోయాడు. దీనిని గ్రహించిన మహిళ కానిస్టేబుల్ అతడు అటు వెళ్లగానే డయల్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.