దళిత యువకుడిపై చెప్పుతో దాడి

by Disha Web Desk 2 |
దళిత యువకుడిపై చెప్పుతో దాడి
X

దిశ, డైనమిక్​ బ్యూరో : ఓ దళిత యువకుడిని చెప్పుతో కొటించిన దారుణం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో చోటు చేసుకుంది. తారకేశ్వరరావు మద్యం తాగి, వైసీపీ ఎంపీటీసీ బీఎన్ రాజును అసభ్య పదజాలంతో దూషించి, అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించాడు. సెల్​ఫోన్​ దొంగిలించాడన్న ఆరోపణతో తారకేశ్వరరావును సూరిబాబు చెట్టుకు కట్టి, చెప్పుతో కొట్టి, అసభ్య పదజాలంతో దూషించాడు. వైసీపీ నేతను తిట్టాల్సిన అవసరం ఏముందని విరుచుకుపడ్డాడు. ఇది వైసీపీ నాయకుడి ఇంటి ముందు జరగడంతో రాజకీయంగా కలకలం రేపుతుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Next Story

Most Viewed