కుటుంబ కలహాలతో.. తల్లి కూతురు ఆత్మహత్య

by Vinod kumar |   ( Updated:2022-08-19 11:04:57.0  )
కుటుంబ కలహాలతో.. తల్లి కూతురు ఆత్మహత్య
X

దిశ, ములుగు : కుటుంబ కలహాలతో తల్లి కూతుర్లు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు మండలం జప్తి సింగాయపల్లి అడవి ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రంగ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వాగు నూతి గ్రామానికి చెందిన సగ్గు జయమ్మ (55) జ్యోతి (25) లుగా గుర్తించారు.


ఆత్మహత్యకు గల కారణం కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోగా.. గురువారం మధ్యాహ్నం నుంచి తల్లి కూతురు ఇంటి నుంచి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం ఫారెస్ట్‌లో ప్రాంతంలో నిప్పంటించుకుని చనిపోయినట్లు తెలిసింది. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం కొరకు గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రంగ కృష్ణ తెలిపారు.



Advertisement

Next Story

Most Viewed