అక్కతో పెళ్లి నిశ్చయం.. వరుడుకి చెల్లెలితో బలవంతపు పెళ్లి.. చివరకి ఏమైందో తెలిస్తే షాక్..

by Disha Web Desk 11 |
అక్కతో పెళ్లి నిశ్చయం.. వరుడుకి చెల్లెలితో బలవంతపు పెళ్లి.. చివరకి ఏమైందో తెలిస్తే షాక్..
X

దిశ, చార్మినార్​: అక్కతో ఆటో డ్రైవర్​తో వివాహం నిశ్చమయ్యింది.. పెళ్ళికి ముందే అక్క మరో ప్రేమించిన వ్యక్తితో జంప్​ అయ్యింది.. పరువు కాపాడుకోవాలనే ఉద్దేశంతో చెల్లెలును సదరు ఆటోడ్రైవర్​ను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు.. నేను మరో వ్యక్తిని ప్రేమించానని చెల్లెలు ముందే చెప్పింది.. నువ్వు ఈ పెళ్ళి చేసుకోకపోతే తాము చస్తామని బెదిరించి మరీ అక్కతో జరుగాల్సిన వరుడితో చెల్లెలును ఇచ్చి వివాహం చేశారు. 8 నెలలకే తెల్లవారుజామున భర్తకు మసాజ్​ చేసి టీలో మత్తు మందు కలిపి ప్రియుడితో ఉడాయించింది.. తన భార్య 5 తులాల బంగారు నగలతో కనిపించకుండా పోయిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు భర్త ఇష్టం లేడని.. ప్రియుడితోనే ఉంటానంటున్న భార్య.. తనకు భార్యే కావలంటున్న భర్త .. తాను ప్రేమించినదానినే పెళ్ళి చేసుకుంటానన్న ప్రియుడు.. ఈ ట్రయాంగుల్​ లవ్​ స్టోరి చాంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్​ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.

చాంద్రాయణగుట్ట ఎఎస్ఐ సీతాపతి తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్​కు చెందిన ఇక్బాల్​కు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. ఆయన రెండవ కూతురుకు గౌస్​నగర్​కు చెందిన సమీర్​ (22), ఆటో డ్రైవర్​తో వివాహం నిశ్చయమయ్యింది. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని పెళ్లికి ముందే రెండవ కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో తమ పరువు పోయిందని, పరువు కాపాడుకోవాలంటే చిన్న కూతురు ఆలియా బేగం (20) ను సమీర్​కు ఇచ్చి వివాహం జరిపించాలని ఇక్బాల్​ నిశ్చయించుకున్నాడు. ఇదే విషయాన్ని ఆలియా బేగంతో ప్రస్తావించగా ఆమె ససేమిరా అన్నది. నేను నౌషద్​ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతనినే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. రెండవ కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందని బాధపడుతుంటే, నువ్వు కూడా ప్రేమ వివాహం చేసుకుంటే మేము చస్తామని బెదిరించి, బలవంతంగా ఒప్పించి 8 నెలల క్రితం ఆలియాబేగంను సమీర్​కు ఇచ్చి వివాహం జరిపించాడు.

ఇటు ప్రేమికుడిని మరువలేక.. తల్లి దండ్రులు బలవంతంగా చేసిన పెళ్లి ఇష్టం లేక భర్త సమీర్​తోనే ఉన్నది. నెలకొక సారి పుట్టింటికి వెళ్లినప్పుడల్లా నౌషద్​తో కలవడం పరిపాటిగా మారింది. ఈ నెల 27వ తేదీన తెల్లవారుజామున రెండు గంటల సమయంలో భర్త సమీర్​కు మసాజ్​ చేసింది. టీలో మత్తు మందు కలిపి ఆలియా బేగం ప్రియుడితో జంప్​ అయింది. మత్తు వీడాక గమనిస్తే ఇంట్లో భార్య లేకపోవడంతో ఆందళోనకు గురైన సమీర్​ తన భార్య ఆలియాబేగం కనిపించడం లేదని, తనతో పాటు 5 తులాల బంగారు ఆభరణాలను తీసుకెళ్లిందని చాంద్రాయణగుట్ట పోలీసులకు సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్​ కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసుల దర్యాప్తులో ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆలియా బేగం సెల్​ఫోన్​ నెంబర్​ ఆధారంగా ఆమె ఔరంగాబాద్​లో నౌషద్​ అనే ప్రేమికునితో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిద్దరినీ సముదాయించి పోలీస్​స్టేషన్​కు రప్పించారు.

తాను నౌషద్​ అనే వ్యక్తిని ప్రేమించానని, తనకు ఇష్టం లేదన్నా తన తల్లిండ్రులు బలవంతంగా బెదిరించి పెళ్లి చేశారని పోలీసులకు తన గోడు వెళ్లబోసుకుంది. తన భర్త సమీర్​ అంటే తనకు ఇష్టం లేదని, తన ప్రియుడి వద్దే ఉంటానని ఆలియాబేగం పోలీసులకు తేల్చి చెప్పింది. భర్త మాత్రం తనకు తనభార్య ఎట్టిపరిస్థితుల్లో కావాలని మొండికేసి కూర్చున్నాడు. ప్రియుడు నౌషద్​ మాత్రం ఆలియాబేగంను ప్రేమిస్తున్నానని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పోలీసులు నోళ్ళు వెల్లబెట్టారు. రంగంలోకి దిగిన ముస్లిం మతపెద్దల ముందు కూడా అలాగే చెప్పడంతో ఇదెక్కడి లొల్లి అని తలలు పట్టుకుంటున్నారు.

తన కుటుంబం, భర్తతో ప్రాణ హాని ఉంది..

ఆలియా బేగం తనకు ఇష్టం లేని బలవంతంగా సమీర్​ అనే వ్యక్తితో వివాహం జరిపించారని, విడాకుల కోసం ప్రయత్నించానని, కుదరకపోవడంతో తాను ప్రేమించిన నౌషద్​ అనే వ్యక్తితో ఇష్ట పూర్వకంగా వెళ్లిపోయానని, ఇందులో నౌషద్​ కుటుంబ సభ్యులకు సంబంధం లేదన్నారు. తనకు తన భర్త, కుటుంబంతో ప్రాణ హాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరారు.



Next Story

Most Viewed